నవ్యాంధ్రకు పెద్దమొత్తంలో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం అమెరికా పర్యటన ఐదో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆదివారం శాన్‌జోస్‌లో పర్యటించిన చంద్రబాబు అక్కడి ప్రవాస తెలుగువారి సమావేశంలో పాల్గొని ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. తెలుగువారిని చూస్తుంటే అమరావతిలో ఉన్నానో, అమెరికాలో ఉన్నానో తెలియడంలేదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు తన ఐదో రోజు పర్యటనను మరింత ఉత్సాహంగా మొదలు పెట్టారు. ఈ రోజు పర్యటనలో భాగంగా ఆయన సిస్కోవరల్డ్‌ వైడ్‌ హెడ్‌ జాన్‌ చాంబర్స్‌, జాన్‌ కేర్న్‌లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందర రాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: