అమెరికాలో మంచి ఉద్యోగం..చేస్తూ హాయిగా భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్న ఆ ఇంట విషాదం నెలకొంది.   తనయుడి కోసం వెళ్లి తండ్రి మృత్యువాత పడిన సంఘటన అమెరికా లోని డెట్రాయిట్ లో జరిగింది.  మూడేళ్ల చిన్నారి తమ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ట్రై తొక్కుతూ   అనంతశాయి ప్రమాదవశాత్తూ దగ్గరలోని ఈ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు.  

ఇది గమనించిన తండ్రి నాగరాజు కొడుకుకోసం ఆ స్విమ్మింగ్ ఫుల్ లో ఒక్కసారే దూకడంతో ఊపిరాడక కన్నముశాడు.  తండ్రీ కొడుకులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుపోగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. గుంటూరుకు చెందిన సూరేపల్లి శివలింగయ్య, సుభానమ్మ కొడుకు నాగరాజు 2006 లో బీ టెక్ పూర్తి చేశాడు.

బెంగుళూరు లోని ఇన్ఫోసిస్ సంస్థలో పని చేసే ఈయన ప్రాజెక్ట్ వర్క్ కోసం 2014 లో అమెరికా వెళ్ళాడని 2012 లో ఇతనికి వివాహమైందని తెలిసింది. నాగరాజు అతని కొడుకు మరణవార్త తెలిసి గుంటూరులోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే ఐతే ఇది అనుమానాస్పద మృతిగా కూడా భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: