తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆఫ్ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్లో బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్, సుంగే కేడుట్లో జులై 16న బోనాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సింగపూర్లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారితో పాటు తెలుగువారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ పిలుపునిచ్చింది. వేడుకలకు సమన్వయ కర్తలుగా అలసాని కృష్ణారెడ్డి, సురేశ్ చిల్క, దుర్గాప్రసాద్, నల్ల దీప, చెట్టిపల్లి శ్రీవిద్య, బసిక అనితరెడ్డి, చల్ల కృష్ణ, అనపురపు మల్లేశం వ్యవహరిస్తున్నారు.
బోనాల పండుగకు అందరికీ ఆహ్వానం తెలుపుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ సొసైటీ అధ్యక్షుడు బండ మాధవరెడ్డి, ఉపాధ్యక్షులు నీలం మహేందర్, పెద్ది శేఖర్రెడ్డి, బూర్ల శ్రీను, ముదాం అశోక్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్రెడ్డి, కోశాధికారి గడప రమేశ్, కార్యవర్గ సభ్యులు మిర్యాల సునీత, ఎల్లా రాం, పెద్దపల్లి వినయ్, సీహెచ్ ప్రవీణ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, గరెపల్లి శ్రీనివాస్, శివరామ్, చెట్టిపల్లి మహేశ్, ఆర్.సి.రెడ్డి, నల్ల భాస్కర్, దామోదర్, భరత్లు కృతజ్ఞతలు తెలియజేశారు.