కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఎన్నారైల మీద ప్రభావం చూపనుంది.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, పబ్లిప్ ప్రావిడెంట్ ఫండ్ వంటి చిన్న పొదుపు పథకాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది. పొదుపు పదాకాలని తీసుకున్న వ్యక్తీ ఒక వేళ..ఎన్ఆర్గా మారితే చిన్న పొదుపు పథకాల అకౌంట్లు మూసి వేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల మొదట్లో జారీచేసిన అధికారిక గెజిట్లో ప్రభుత్వం ఈ నిబంధనలను నోటిఫై చేసింది.
పీపీఎఫ్ స్కీమ్ 1968 సవరణ ప్రకారం ఒకవేళ ఈ స్కీమ్ కింద అకౌంట్ ప్రారంభించిన రెసిడెంట్, మెచ్యురిటీ పిరియడ్ సమయంలో నాన్-రెసిడెంట్ అయితే,వారు ఎన్ఆర్ఐ అయినప్పటి నుంచి అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఒక అవకాశం మాత్రం ఇచ్చింది...ఎన్నారైలు తమ తమ అకౌంట్ మూసివేసే వరకు వడ్డీని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించింది.
అంతేకాదు..వీటితో పాటు నెలవారీ ఆదాయ పథకాలు, పోస్టు ఆఫీసు ఆఫర్ చేసే ఇతర టైమ్ డిపాజిట్లకు ఎన్ఆర్ఐలను అనుమతించకుండా ప్రభుత్వం ఈ నిబంధనలను సవరించింది..నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లకు కూడా ఈ మేరకు ఓ ప్రత్యేక నోటిఫికేషన్ను జారీచేయనున్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లకు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్,. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటు 7.8 శాతంగా ప్రభుత్వం నిర్ధారించింది. ఇతర చిన్న పొదుపు పథకాల రేట్ల మాదిరిగానే ఈ రేట్లు ఉన్నాయి.మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నారైల నుంచీ ఎలాంటి స్పందన వస్తోందో చూడాలి మరి.