తెలుగువాళ్ళు ఎక్కడున్నా సరే మన భాషా,సంస్కృతి ,సాంప్రదాయాలకి విలువఇస్తూనే ఉంటారు..విదేశాలలో ఉన్న మనవాళ్ళు అందరు ఒక్క చోటున కలిసి పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.తెలుగు భాషా సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు.

 

హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుంచీ 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు.విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన ఈ సన్నాహక సదస్సు కు మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

 

ప్రపంచమంతా పర్యటిస్తూ ఈ మహాసభలకు తెలుగు వారిని, సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులకు ఆహ్వానిస్తున్నట్టు అయన చెప్పారు...తెలుగు జాతి మొత్తం  సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమం లో TCA, TRS USA,సిలికాన్ ఆంధ్ర, BATA, VTA ,TDF,TATA,TANA, ATA, San Ramon Friends,STA, తెలంగాణ జాగృతి HSS, DNF సంఘాల ప్రతినిధులు,తెలుగు రచయతలు, కళాకారులు..తదితర వ్యక్తులు అందరు పాల్గొన్నారు.  

 


మరింత సమాచారం తెలుసుకోండి: