చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు..కొంతమంది నవ్వుతు నవ్వుతు ఉండగానే ప్రాణాలు కోల్పోతారు..మరి కొందరు నిద్రలో లో ప్రాణాల్ని వదిలేస్తారు..అసలు ఎప్పుడు ఈ చావు ముంచుకు వస్తుంది అనేది చెప్పలేము..అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా మంచిది..న్యూయార్క్ లో కోస్టారికా కోకస్ ద్వీపంలో ఇలాంటి సంఘటనే ఎదురయ్యింది.
కోస్టారికాలోని కోకస్ ద్వీపంలో స్క్యూబా డైవింగ్ చేయడానికి 18 మంది వెళ్లారు...వారిలో భారత సంతతికి చెందిన 49 ఏళ్ల ఓ మహిళ కూడా ఉంది.. వీళ్ళు అందరు ఒక్కసారిగా డ్రైవింగ్ చేస్తూ ఉండాగా హటాత్తుగా షార్క్ వచ్చి దాడి చేయడం మొదలు పెట్టింది..ఈ దాడిలో రోహినా భండారీ తీవ్రంగా గాయపడ్డారు..వెంటనే అక్కడ ఉన్న వైద్యులు సకాలంలో స్పందించినా సరే తీవ్రమైన గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది.
అయితే ఈ దాడిలోనే స్కూబా డైవింగ్ మాస్టర్ కూడా షార్క్ వల్ల స్వల్ప గాయలపాలయ్యారు...ఈ విషయాలని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లిడించారు. ఈ సన్నివేశాన్ని చుసిన ప్రత్యక్ష వ్యక్తులు ప్రకారం..షార్క్ దాడి చేస్తుంటే తప్పించుకోవాలి అని అనుకున్న్నా సరే అస్సలు కుదరలేదు అని ఈ దాడిలో ఆమె ప్రాణాలని కోల్పోవడం ఎంతో భాదకారం అని తెలిపారు. భండారీ ఒక ప్రైవేటు సంస్థలో ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు..
అయితే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ.. షార్క్ మామీద దాడి చేసినప్పుడు తప్పించుకోవడానికి షార్క్ నుంచి దూరంగా ప్రయాణించేందుకు ఎంత ప్రయత్నించినా అది వేగంగా వచ్చి దాడిచేసిందని తెలిపారు. ఓ ప్రైవేటు సంస్థలో భండారీ ఈక్విటీలో మేనేజరుగా పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కోకస్ ద్వీపం రకరకాల షార్క్ జాతులకు ప్రసిద్ధి చెందినదిగా గుర్తింపు పొందడంతోపాటు, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో నుంచి కూడా గుర్తింపు పొందింది.