కువైట్ లో  భారతీయ రాయబారిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాష్ట్రానికి చెందిన కే. జీవసాగర్ నియామకమయ్యారు..కువైట్ లో  రాయబారిగా నియామకమయిన... మొట్టమొదటి తెలుగు వ్యక్తి జీవసాగర్ కావడం గమనార్హం. కృష్ణాజిల్లా, మచిలీపట్నానికి చెందిన  జీవసాగర్.. 1991లో అఖిల భారతీయ సర్వీసుకు ఎంపికయ్యారు. ఇరానీ భాష ,ఫార్సీలో ప్రావీణ్యం పొందిన సాగర్  ఇరాన్‌లో దౌత్యవేత్తగా తన ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టారు. అఫ్రికా, యూరోప్, అసియా దేశాలతో పాటు విదేశాంగ శాఖలో కీలకమైన పాకిస్థాన్కు  వ్యవహారాల విభాగం అధిపతిగా కూడా ఆయన పని చేశారు. 

 Image result for జీవసాగర్

రైలు దుర్ఘటన అనంతరం ఉగ్రవాద నిర్మూలనపై పాకిస్తాన్‌ తో కలిసి జరిగిన మొదటి సంయుక్త సమావేశంలో జీవసాగర్ భారత్ పక్షాన ఎంతో కీలక పాత్ర వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా పర్యటనలో కూడా కీలక పాత్ర వహించిన ఆయన ప్రస్తుతం సంయుక్త కార్యదర్శిగా న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు నిర్వహించే విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

 Image result for జీవసాగర్

తాజాగా కువైట్ లో రాయబారిగా నియామకం అవడంతో త్వరలో కువైట్  రాజు (అమీర్) షేక్ సభాను కలుస్తారు. ఇప్పటి వరకు రాయబారిగా పని చేసి తెలుగు వారి సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన రాజస్ధాన్‌కు చెందిన సునీల్ జైన్ పదవి విరమణ చేసిన కొద్ది నెలలుగా కువైత్‌లో రాయబారి పదవి ఖాళీగా ఉంది...మచిలీపట్నంలోని నోబల్ కళాశాలలో చదివిన జీవ సాగర్..కెనరా బ్యాంకులో కూడా వివిధ హోదాలలో పని చేశారు.ఆయనకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు.  దౌత్యవేత్తగా తెలుగు వ్యక్తీ ఉండటంతో తెలుగు ప్రజలు అందరు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: