సృష్టిలో అత్యంత విలువైనది దేవుడి తనకు బదులుగా సృష్టించిన సృష్టి తల్లి. ప్రపంచ ఎవరు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా తల్లి ప్రేమ చచ్చేంత వరకు ఉంటుంది. అది మనిషే కవొచ్చు, జంతువే కావొచ్చు, పక్షులే కావచ్చు తల్లి ప్రేమ ఎంతో అపురూపమైనది. కానీ తల్లి ప్రేమకే మచ్చ తెచ్చే ఈ విషయం వింటే ఒళ్లు జల్లుమంటుంది. కేవలం మారం చేస్తున్న కారణం చేత కన్న కొడుకునే తల నరికి చంపిన వైనం రాజస్థాన్ లోని అజ్మిర్ జిల్లాలో జరిగింది. విషయానికి వస్తే అంతిమా అనే ఓ మహిళ పచారీ సామాన్లు తేవడానికి షాపు వెల్లడానికి పూనుకుంది అదే సమయంలో తన కొడుకు కూడా తన వెంట వస్తానని మారాం చేయడం మొదలు పెట్టాడు. దీంతో రెండు మూడు సార్లు నచ్చచెప్పి చూసింది పిల్లాడు ఎంతకూ వినకపోవడంతో విసిగెత్తిన ఆ మహిళ పిల్లవాడి తల నరికి వేసింది. ఈ దారుణం పొరుగున ఉన్న సంజయ్ శర్మ అనే వ్యక్తి చూసి ఖంగు తిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి అంతిమాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో తనే ఆ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపింది. దాంతో ఆమెని అరెస్ట్ చేసి బాలుడి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: