ఓ దళిత బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధుర జిల్లా పింగ్రి గ్రామంలో శనివారం రాత్రి ఓ ఆలయంలో జరిగిన ఉత్సవానికి బాలిక వెళ్లింది. అనంతరం ఆ బాలిక అదే రోజు రాత్రి బహిర్భూమికి వెళ్లగా ఆమెను ఆరుగురు యువకులు అపహరించి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి వెళ్లారు. ఆ భయంతో ఇంటికి వెళ్లిన బాలిక మర్నాడు కుటుంబ సభ్యులకు జరిగిన ఘోరాన్ని వివరించింది. దానిపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన నిందితులు మనోజ్, మహేష్, గుడ్డు, సన్నో, రామ్‌వీర్, శేఖర్‌గా గుర్తించినట్లు పోలీసు అధికారి నితిన్ తివారీ సోమవారం మీడియాకు తెలిపారు. మహేశ్ తప్ప మిగతా అందరినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: