మంచు, అక్కినేని, దగ్గుబాటి, నందమూరి.. ఇవన్నీ టాలీవుడ్ ఫ్యామిలీస్.. ఈ కుటుంబాల్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఇంటి నిండా సినీ జనమే. అభిమానులు కూడా వారిని అంతే ప్రేమగా ఆదరిస్తారు. అందుకే తెలుగు చిత్ర సీమలో వారసుల రాక చాలా ఎక్కువ. మంచు ఫ్యామిలీలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ హీరోలుగా తెరపైకి వచ్చారు. ఆ తర్వాత మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా తెరపై సందడి చేసింది. వీరి సినిమాలు విడివిడిగా చూస్తున్నా.. వాటి కంటే.. అందర్నీ ఒకే తెరపై చూడాలన్న కోరిక అభిమానులకు ఎంతో సహజం. అభిమానుల కోరికను మంచు ఫ్యామిలీ ఇప్పటికే తీర్చేసింది. ఒక్క లక్ష్మి మినహా.. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంలో వీరంతా కనిపించారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ అభిమానుల కోరిక నెరవేర్చింది. అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్యలతో పాటు.. అఖిల్ కూడా సందడి చేశారు. అపురూప ప్రేమకావ్యంగా ఈ చిత్రం అభిమానులను అలరించింది. అక్కినేని నాగేశ్వరరావు తన చివరి చిత్రంతో అభిమానులకు కన్నులపండువ చేసారు. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ వచ్చిందని సమాచారం. దగ్గుబాటి ఇంట్లో.. రామానాయుడు, సురేశ్ నిర్మాతలుగా, వెంకటేశ్, రానా హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్లోనూ మల్టీస్టారర్ హవా నడుస్తుండటంతో దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ మల్టిస్టారర్ కు ప్లాన్ చేస్తోందని తెలిసింది. దగ్గుబాటి సురేష్ తన తమ్ముడు వెంకటేష్, కొడుకు రానా తో కలిపి మూవీ తీయబోతున్నారట. ఐతే.. సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారట. త్వరలోనే దగ్గుబాటి అభిమానుల కల నెరవేరబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: