ఎలకతోలు తెచ్చి ఎన్నేళ్లు ఉతికినా నలుపు నలుపేకాని తెలుపు రాదు.. ఈ సామెత భారత దేశంలో ఉన్న కామాంధులకు సరిగ్గా సరిపోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మా పని మేం చేసుకు పోతుంటాం ఆడది కనబడితే చాలు పిచ్చికుక్కల్లా రెచ్చిపోతున్న పోకిరీలకు ఎన్ని చట్టాలు తీసకువచ్చినా అంతంతమాత్రమే అవుతున్నాయి. తాజాగా ఓ యువతిని నలుగురు యువకులు అటకాయించి ఆమెకు గన్ చూపించి కారులో ఎక్కించుకొని నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాదు ఆమె వద్ద ఉన్న ఐదు వేల రూపాయల నగదు కూడా తీసుకుని ఉడాయించారు. అయితే ఈ సంఘటన సాక్షాత్తు దేశ రాజధాని న్యూఢిల్లీ 8వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. బాధితురాలు న్యూఢిల్లీ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని నిందుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలు ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర నగరం అని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: