తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆంద్ర చౌదరిల ఏజెంట్ మాదిరి వ్యవహరిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిధి ఉమేష్ రావు విమర్శించారు. తెలంగాణలో దొరల రాజ్యం సాగుతోందని రేవంత్ అనడం పై ఆయన మండిపడ్డారు.ఇలా దొరలపాలన అంటూ, ఒక కులంపేరుతో విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.రేవంత్ అచ్చంగా ఆంద్ర చౌదరిల మోచేతి నీళ్లు తాగుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెబుతున్నవన్ని అబద్దాలేనని విమర్శించారు . చంద్రబాబు వెయ్యి అబద్దాలు చెబుతుంటే, దానికి ఇంకో ఏభై అదనంగా వీరు చెబుతుంటారని ఆయన అన్నారు. తెలంగాణలో దళిత , బహుజనులకు మేలు జరిగే పాలన జరుగుతుంటే,దొరల పాలన అంటూ రేవంత్ మాట్లాడడం పద్దతి కాదని ఆయన ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: