గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. సూచనలు, సలహాలు ప్రస్తుతం పార్టీకి ఎంతో అవసరమని అన్నారు. ధర్మపోరాటంలో అంతిమవిజయం తమదేనని జగన్ అన్నారు. తాను ఎన్నికల సమయంలో అబద్దపు ప్రచారాలు, అమలుచేయలేని హామీలు ఇవ్వలేదని, కాబట్టే పార్టీ ఎన్నికలలో స్వల్పతేడాతో ఓడిపోయిందని అన్నారు. చంద్రబాబులా అబద్దపు, మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే తప్పకుండా పార్టీ అధికారంలోకి వచ్చేదన్నారు. అమలుచేయలేని హామీలు ఇస్తే, కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటామని, నిస్పక్షపాతంగా, ప్రజలపక్షాన పోరాటం చేస్తే, ప్రజలు వచ్చే ఎన్నికలలో పార్టీకి పట్టం కడతారని వై ఎస్ జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తున్నాడు.. జాబు వస్తుందన్నారు. ఇప్పుడేమో ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వై ఎస్ ఆర్ పార్టీ నిత్యం ప్రజలో ఉండి ప్రజల తరుపున పోరాడి… బాబు మోసాలను ప్రశ్నిద్దామని జగన్ అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం త్వరలోనే ప్రజల ఆక్రోశాన్ని చవిచూస్తుందని జగన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: