ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టైల్ లో నిజంగానే మార్పు వచ్చిందనుకోవాలి. ఆశ్చర్యంగా ఆయన ఏకంగా మంత్రివర్గ సమావేశంలోకే మంత్రులు కాని వారిని కూడా అనుమతిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.సాధారణంగా మంత్రివర్గ సమావేశంలో మంత్రులు తప్ప వేరేవారు పాల్గొనరాదు. ఏదైనా సబ్జెక్టు ఉంటే సంబందింత శాఖల అదికారులు, సలహాదారులను ఆ అంశాలపై చర్చ వరకు సమావేశంలో ఉండనిస్తారు. ఆ తర్వాత వారు వెళ్లిపోవలసి ఉంటుంది.అలాకాకుండా మంత్రివర్గ సమావేశంలోకి టిడిపి ఎమ్.పిలు సుజనా చౌదరి,సి.ఎమ్.రమేష్, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్,ప్రభృతులు పాల్గొన్నారని కధనాలు వస్తున్నాయి.ఇది కరెక్టా ? కదా అన్నది పక్కన బెడితే ఇలా గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి హయాంలో జరగలేదన్నది వాస్తవం.దీనిపై మంత్రులు, కొందరు ఐఎఎస్ అదికారులలో కూడా అసంతృప్తి ఉన్నా అభ్యంతరం చెప్పే పరిస్థితిలో వారు లేరని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: