ఈ మధ్యకాలంలో నిజామాబాద్ మాజీ ఎమ్.పి మధు యాష్కి ముఖ్యమంత్రి కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు.ఏకంగా కెసిఆర ను ఆయన మోనార్కు అని అంటున్నారు. భయంతోనే జనం సర్వేలో పాల్గొన్నారని, టీ. సీఎం కేసీఆర్ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని యాష్కి దుయ్యబట్టారు.ఆయన పాలనలో రాజరిక పోకడలు కనిపిస్తున్నాయని అన్నారు. యావత్ ప్రపంచం హిట్లర్‌ను నిలదీస్తుంటే, తాను హిట్లర్‌కే ప్రతిరూపమని చెప్పుకోవడం కెసిఆర్ అవివేకమని మధుయాష్కి విమర్శించారు. బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు లేకుండా చేయడానికే ఈ సర్వే అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ద్వేషిస్తే తెలంగాణకే నష్టమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: