తాము చేస్తే శృంగారం అవతలి వారు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ వ్యవహారం! తాజాగా స్పీకర్ మైకులు విరగొట్టారని అంటూ వైకాపా సభ్యులను ఇద్దరిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ బతకు పోడియంకే పరిమితం అయ్యిందని, అధికార పక్ష సభ్యులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇక జగన్ పై తాము వేయాలనుకొంటున్న ముద్రలో భాగంగా స్పీకర్ మైకులు విరగగొట్టడాన్ని రౌడీయిజంగా అభివర్ణించింది తెలుగుదేశం పార్టీ! మరి ఇదే రౌడీయిజం అయితే... గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఏమనాలి?! దాన్ని గూంఢాయిజం అనాలా? లేక ఆ తీరుకు తెలుగుదేశం వాళ్లే ఏదైనా పేరును పెడతారా?! ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో ఒకొనొక సమయంలో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతుండగానే తెలుగుదేశం సభ్యులు రెచ్చిపోయారు. సరైన రీజన్ కూడా లేకుండానే వారు విరుచుకుపడ్డారు. ఏకంగా గవర్నర్ చేతిలోని ప్రసంగ ప్రతులను లాక్కొన్నారు. సభాధ్యక్ష స్థానం వరకూ ఎక్కాడు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు కొంతమంది తెలుగుదేశం సభ్యులు సభలో అల్లకల్లోలం సృష్టించారు! అంత త్వరగా మరిచిపోయే వ్యవహారం కాదది! కావాలంటే యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు స్పీకర్ మైకులు విరగగొట్టడమే రౌడీ యిజం అయితే... నాడు గౌరవ తెలుగుదేశం సభ్యులు వ్యవహరించిన తీరును ఏమనాలో అర్థం కాని పరిస్థితి! ఇప్పుడు సుద్దులు చెబుతున్న తెలుగుదేశం వాళ్లు.. అప్పుడు హద్దులు ఎందుకు నడుచుకోలేదు? ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్న వాళ్లు.. అప్పటి సంఘటనలపై ఇప్పుడు కనీసం విచారం వ్యక్తం చేయగలరా?! లేక ఇలాగే ఆత్మస్తుతి పరనింద తీరుతో ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూ కూర్చొంటారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: