మెదక్ ఉప ఎన్నిక కోసం నలభై మందితో ప్రచారకర్తల జాబితాను కాంగ్రెస్ సిద్దం చేసింది. ఇందులో దిగ్విజయ్ సింగ్, గులాం నబీ అజాద్, అజారుద్దీన్ , సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా,కుంతియాలతో పాటు తెలంగాణకు చెందిన పలువురు నేతల పేర్లను అందులో పెట్టారు. పిసిసి అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సిఎల్పి నేత జానారెడ్డి, శాసనమండలిలో కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ తో సహా వి.హనుమంతరావు,సర్వే సత్యనారాయణ,డి.కె. అరుణ,కొప్పుల రాజు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. విశేషం ఏమిటంటే పొన్నాల కోడలు వైశాలి కూడా ఈ జాబితాలో ఉండడం . ఈ నలభై మంది ప్రచారంతో కాంగ్రెస్ దశ తిరుగుతుందా?

మరింత సమాచారం తెలుసుకోండి: