తెలంగాణలో ఈసారి టిడిపికి చెందిన మరో వికెట్ డౌన్ అయ్యేలా ఉంది. ఇప్పటికే పార్టీ ఉప నేత, సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సంకేతాలు వస్తుండగా, మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిశారు. అభివృద్ది కార్యక్రమాల నిమిత్తం కలిశానని ఆయన చెబుతున్నా,అసలు విషయం మాత్రం టిఆర్ఎస్ లో చేరే విషయం చర్చించినట్లు చెబుతున్నారు.ఈయన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.నగరానికి చెందిన పలువురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ఈ సందర్భంగా కెసిఆర్ చెప్పారని సమాచారం. కాగా తలసాని మరోసారి కెసిఆర్ ను కలిసి తాను కోరిన విధంగా ఐడి్హెచ్ కాలనీని సందర్భించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: