సూపర్ స్టార్ రజనీ కాంత్ వెండితెరపై కనిపిస్తే చాలు కోట్లాది మంది రజనీ అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగి పోతారు. రజనీ కటౌట్ లకు పాలాభిషేకాలు చేస్తూ ధియేటర్ లోని వెండితెరకు హారతులు ఇస్తూ ఉంటారు. తమిళనాడులో రజనీకాంత్ సినిమా విడుదల అయిన రోజు ఒక పండుగ వాతావరణం ప్రతి ఉరిలోను కనిపిస్తుంది.  అటువంటి రజినీ ప్రేక్షకుల కళ్ల ముందే రంగ స్థలo పై నటిస్తే వచ్చే స్పందన ఊహకు కూడ అందని విషయం. అతి త్వరలోనే సూపర్ స్టార్ రజనీ లైవ్ పెర్‌ఫార్మెన్స్ చూసే అదృష్టం తమిళ ప్రజలకు కలగబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. రజనీ తోడల్లుడు, నటుడు, రచయిత అయిన వైజీ మహేంద్రన్ ఆ అదృష్టాన్ని తమిళ ప్రేక్షకులకు కల్పించే పనిలో బిజీగా ఉన్నట్లుగా టాక్. ఈయన సూపర్ స్టార్ కోసం ఒక నాటకం రాశారట. ఈ నాటకంలో రజనీకాంత్‌ని నటింపజేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు మహేంద్రన్. ఇప్పటికే ఈ విషయమై తన కోరికను రాజినీతో చెప్పినట్లుగా మహేంద్రన్ చెపుతున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు రజినీ నటించబోయే ఈ నాటిక ‘లింగ’ విడుదల తరువాత ఉంటుందని అంటున్నారు. సినిమాలతో సమానంగా తమిళనాడులో నాటకాలకు ప్రేక్షకులు వస్తారు అన్న విషయం తెలిసిందే. రజినీ సినిమా రంగానికే కాకుండా ఇండియన్ డ్రామా ఫీల్డ్ కు కూడ సూపర్ స్టార్ గా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: