శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కిలాడి లేడి హల్ చల్ చేసింది. టీ లో మత్తుమందు కలిపి మహిళా భక్తులకు విక్రయించింది. ఆ టీ తాగి మహిళలు స్పృహతప్పి పడిపోయారు. దాంతో సదరు మహిళల వద్ద నుంచి నగలు, నగదు దోచుకుంది. ఆ విషయాన్ని గమనించిన ఆలయంలోని భక్తులు వెంటనే స్పందించి కిలాడీ లేడిని పట్టుకుని దేహశుద్ది చేసి... ఆలయ భద్రత సిబ్బందికి అప్పగించారు. దీంతో ఆమెను స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను స్టేషన్ కు తరలించారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకుని...కేసు నమోదు చేశారు. స్పృహ కోల్పోయిన మహిళలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: