తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ కాపాడుకోవాలంటే పార్టీ నేతలంతా రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నాడట ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అండ్ కంపెనీపై ధ్వజమెత్తుతూ విరుచుకుపడినట్టుగా అందరూ రెచ్చిపోతేనే... పార్టీ ఇక్కడ మనుగడ సాగించగలదు అని చంద్రబాబు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వంపై పోరాటంలో ముందుండాలని.. ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకూడదని చంద్రబాబు తన పార్టీ నేతలకు సూచించాడట. ఇప్పుడు అలా వచ్చిన అవకాశమే మెట్రోరైలు వ్యవహారం. ఇప్పుడు దీనిపై ప్రజాక్షేత్రంలోనూ... శాసనసభలోనూ పోరాడండి...ప్రభుత్వానికి చెమటలు పట్టించండి అంటూ బాబు దిశానిర్దేశం చేశాడట. మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని తెలుగుదేశం నేతలు అంతా ఆదర్శంగా తీసుకోవాలని బాబు వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకమైన అంశం అని చెప్పవచ్చు. ఒకరకంగా రేవంత్ శ్రమను బాబు గుర్తించినట్టు కూడా అవుతోంది. రేవంత్ రెడ్డి అవకాశం దొరికితే చాలు కేసీఆర్ పై విరుచుకుపడుతున్నందుకు ఈ ప్రతిఫలం దక్కుతోంది. మరి రేవంత్ రెడ్డి భవిష్యత్తు ప్రణాళిలకు ఇది శుభసూచకం అనుకోవచ్చు. ఎలాగైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయిపోవాలనేంత లక్ష్యంతో పనిచేస్తన్న రేవంత్ కు ఇది అనుకూలాంశమే అవుతుంది. మరి బాబు ఇంప్రెషన్ ఆయనపై ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: