తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటోను హిట్లర్లా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెట్టిన టీడీపీ కార్యాలయ ఫేస్బుక్ నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ ఫొటోను హిట్లర్లా మార్చి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ కేసీఆర్ అభిమానులు ఇటీవల ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు కేసీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కులకర్ణి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుశీలారెడ్డి ఈ నెల 12న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 504, 505లతో పాటు, 66ఏ ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తు చేసి, అకౌంట్ నిర్వాహకులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఖీచిఖ్ఛిటటీగిౌఛీ
మరింత సమాచారం తెలుసుకోండి: