యువకుడు కొంతమంది స్నేహితులతో కలిసి జంతువుల్ని చూద్దామని జూకు వెళ్లాడు. కాసేపు జూలో బాగానే ఉన్నా. అతనికి అకస్మాత్తుగా ఏమనిపించిందో ఏమో గానీ.. ఉన్నట్టుండి జంతువుల బోనులోకి దూకాడు. ఇక అంతే పులి చేతిలో పడ్డాడు. ఈ దారుణమైన ఘటన ఢిల్లీలోని జూ పార్కులో మంగళవారం చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ విద్యార్థులు జూలోని జంతువులపై రాళ్లు విసరడం ఆరంభించారు. అనంతరం హిమంశు అనే ఇంటర్ విద్యార్థి పులి ఉన్న బోనులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అతను స్వీయ తప్పిదంతోనే జంతువులు ఉండే బోనులోకి పడినట్లు ఓ జూ అధికారి తెలిపారు. ఈ ఘటనలో అతని శరీరాన్ని పులి పూర్తిగా ఛిద్రం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: