తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతల సమావేశానికి కొందరు శాసనసభ్యులు గైర్ హాజరు కావడం చర్చనీయాంశం అయింది. ఎర్రబెల్లి దయాకరరావు పార్టీని వీడతారన్న ప్రచారం నేపధ్యంలో తెలంగాణ టిడిపి అద్యక్షుడు రమణతో పాటు పలువురు టిడిపి నేతలు,ఎమ్మెల్యేలతో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన విడి,విడిగా కూడా మాట్లాడారు. అయితే ఈ సమావేశానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(ఇబ్రహీంపట్నం), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), రాజేందర్ రెడ్డి( నారాయణపేట) హాజరు కాకపోవడం చర్చనీయాంశం అయింది.  వీరంతా పార్టీ మారతారన్న అబిప్రాయం లేకపోయినా,శ్రీనివాసయాదవ్ వంటి వారు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరికొందరు కూడా ఈ కీలక భేటీకి రావకపోవడం విశేషంగానే ఉంది.కాగా కృష్ణయ్యను స్వయంగా చంద్రబాబే పిలిచారని ప్రచారం జరుగుతోంది.ఆయన మాత్రం తాను బీసీ ఉద్యమాలకే అధిక సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: