అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీకి సోమవారం ఇచ్చిన విందు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మోడీతో భేటీ కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఒబామా, విందు సందర్భంగా మోడీని మంత్రముగ్ధుడిని చేశారు. మోడీని పలకరించేందుకు ఒబామా ఏకంగా గుజరాతీ భాషనే నేర్చుకున్నారు. ‘‘కెమ్ ఛో (ఎలా ఉన్నారు)’’ అంటూ మోడీని పలుకరించిన ఒబామా అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేశారు. ఈ తరహాలో భారత ప్రధానిని పలకరించిన అమెరికా అధ్యక్షుడు దాదాపుగా లేరనే చెప్పొచ్చు. విందులో భాగంగా ఒబామాతో పాటు ఆ దేశ ఉపాధ్యక్షుడు జో బిడెన్, విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్ హాజరు కాగా, మోడీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి జై శంకర్ లు ఉన్నారు. విందు సందర్భంగా శ్వేత సౌధం ముందు ఏర్పాటు చేసిన భారతీయ సంప్రదాయ నృత్యరూపకం ‘‘గర్భా’’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: