ఇటీవల వ్యభిచారం కేసులో పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్ వ్యవహారం గురించి కొన్ని ఆసక్తికరమైన, సంచలన అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. నగరంలోని ఒక హోటల్ లో శ్వేత పట్టుబడిన ఆ గదిని ఒక పత్రిక వారు బుక్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సినిమా అవార్డులు ఇచ్చిన ఆ పత్రిక వాళ్లు ఆ గదిని బుక్ చేసుకొన్నారట. అందులోనే శ్వేతను అరెస్టు చేశారు. మరి ఇందులోనిజానిజాలు ఎన్ని ఉన్నాయో తెలీదు కానీ.. ఫిలిం నగర్ లో ఈ రూమర్లు షికారు చేస్తున్నాయి! శ్వేతను వ్యభిచారం కేసులో అదుపులోకి తీసుకొన్నప్పటికీ ఆమె ఎవరితో ఉందో మాత్రం తెలియడం లేదు. ఆమెను వ్యభిచారం నేరం కింద అరెస్టు చేసినప్పటికీ.. ఆమెతో ఉన్న పురుషుడు ఎవరు? అనే విషయం బయటకు రాలేదు. ఈ విషయంలో సోషల్ సైట్లలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఒక స్త్రీని వ్యభిచారం నేరంలో అదుపులోకి తీసుకొన్నప్పుడు ఆమెతో ఉన్న పురుషుడిని ఎందుకు అదుపులోకి తీసుకోరని... అతడు చేసింది నేరం కాదా? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పోలీసులు మాత్రం అలాంటి విషయాలను పట్టించుకోలేదు... విటుడు ఎవరనే విషయాన్ని చెప్పలేదు. అయితే ఇప్పుడు అనధికారిక సమాచారం... రూమర్ల సారాంశం ఏమిటంటే... ఇటీవల గ్రాండ్ గా జరిగిన ఒక మ్యాగ్జిన్ అవార్డు నిర్వాహకులు శ్వేతను అరేంజ్ చేశారట. తమ కార్యక్రమానికి గెస్టులుగా వచ్చే వారి కోసం ఆమె ను ఎరగా ఉపయోగించుకొన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో లోగుట్టు ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: