ప్రముఖ హీరో రామ్ చరణ్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. హుదూద్ తుపాన్ బాధితుల సహాయార్థం రామ్ చరణ్ 15 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందజేశారు. ఇటీవల సంభవించిన హుదూద్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తన వంతు సాయంగా 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన రామ్ చరణ్ చంద్రబాబుకు చెక్ ను అందజేశారు. ఓ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో టీమ్ కూడా చంద్రబాబును కలసి 4.4 లక్షల విరాళం అందజేసింది. పలువురు సినీ రంగ ప్రముఖులు తుపాన్ బాధితులకు విరాళాలు అందజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: