ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చేసిన సవాల్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేవినేని ఒకవేళ మాటమీద నిలబడే వ్యక్తే అయితే త్వరలోనే ఆయన మాజీ మంత్రి అయ్యేందుకు సిద్ధంగా వుండాలని కేటీఆర్ అన్నారు. శ్రీశైలం నీటి వినియోగం విషయంలో తెలంగాణ మోసానికి పాల్పడుతోందంటూ దేవినేని చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన కేటీఆర్ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే తెలంగాణ అవసరాల నిమిత్తం శ్రీశైలం నీటిమట్టాన్ని 834 అడుగుల వరకు వినియోగించుకోవచ్చని నిర్ధారిస్తూ ఓ జీవోని జారీచేశారని గుర్తుచేశారు. ఆ జీవో కాపీని దేవినేనికి పంపిస్తామని.. అది చదివాక ఆయన రాజీనామా చేసి మాజీ అవుతారో లేక మాట తప్పుతారో చూద్దామని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: