తెలంగాణ రాష్ట్ర సమితిలో అరవై మూడు మంది ఎమ్మెల్యేలకు గాను మంత్రి హరీష్ రావు వర్గంలో ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారని టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు.దాంతోనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు నక్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు.ఎప్పుడైనా తన ముఖ్యమంత్రి కుర్చీకి ముప్పు ఏర్పడుతోందని భయపడే వలసలను కెసిఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు.. తమ పదవులు పోతాయనే భయంతో కొందరు మంత్రులు కూడా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి బతిమిలాడి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలు మారినవారు తమ పదవులకు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: