అందాలకు నిలయమైన అరకు ప్రాంతాన్ని దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దుతామని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన శనివారం ఉదయం అరకు పార్క్‌లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటీవల హుదూద్ తుపాను ఫలితంగా అరకు ప్రాంతంలో కాఫీ తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అరకులో భారీ స్థాయిలో సినిమా షూటింగ్‌లు జరిపేందుకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో తుపాను బాధితులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: