అధ్యాపక వృత్తిలో ఉంటూ ఓ ఉద్యోగినితో రాసలీలకు పాల్పడుతున్న కళాశాల ప్రిన్సిపాల్ వ్యవహారాన్ని విద్యార్థులు గురువారం రాత్రి 9 గంటలకు వెలుగులోకి తెచ్చారు. మండల కేంద్రంలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ తన కింది స్థాయి ఉద్యోగితో ఉంటుండగా విద్యార్థులు పసిగట్టి రెండ్‌హ్యాండ్‌గా పట్టుకుని.. ఇలా చేయడం వృత్తికే మచ్చ అని మందలించారు. విద్యార్థుల రాకను పసిగట్టిన ప్రిన్సిపాల్ పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. తీరా విద్యార్థులు నిలదీసేసరికి తాను భోజనం చేయడానికి వచ్చానని బుకాయించాడు. ఓ కేసు విషయంలో సాయం చేయడానికి వచ్చానే తప్పా ఎలాంటి ఉద్దేశం లేదని సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: