తెలుగుదేశం అద్యక్షుడు ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి సనత్ గగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు.చంద్రబాబు ఏనాడూ ఓ మాట మీద నిలబడలేదని, ఆయన ఒక పెద్ద అబద్ధాల కోరని ఆయన విమర్శించారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి బ్లాక్‌మెయిల్ చేసే వారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ నడుస్తోందని ధ్వజమెత్తారు.టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ఎవరెవరి దగ్గర ఎంతెంత డిమాండ్ చేసి డబ్బు గుంజారో నా దగ్గర జాబితా ఉందని ఆయన అన్నారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతా. చివరకు తమ సొంత పార్టీ ఎంపీని కూడా వదల్లేదని ఆయన ఆరోపించారు. రాజ్యసభ టికెట్లు ఇవ్వడంలో, ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంలో చంద్రబాబుది అంతా వ్యాపారమేనని ఆరోపించారు సీఎం అభ్యర్థిగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ప్రకటించినప్పుడు టీడీఎల్పీ నేతగా ఆయన ఎందుకు పనికిరాలేదని నిలదీశారు.తలసాని మొన్నటిదాకా టిడిపిలోనే ఉండి ఇటీవలే టిఆర్ఎస్ లో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: