నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి కోర్టు నంద్యాల మూడో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. భూమా నాగిరెడ్డితో పాటు మరో 20 మందికి కూడా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు కేసుల్లో భూమా అరెస్టును పోలీసులు చూపించలేదు. అరెస్టు తరువాత అనారోగ్యానికి గురికావడంతో నాగిరెడ్డిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల కస్టడీలో ఉండటంతో తన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారానికి కూడా నాగిరెడ్డి హాజరు కాలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: