వై.ఎస్. జగన్ సోదరి షర్మిల కూడా ‘యాత్ర’లకు దిగుతున్నారు. తెలంగాణలో ‘అడుగు’ పెట్టనున్నారు. డిసెంబర్ 8 నుంచి షర్మిల పాలమూరు నుంచి ‘పరామర్శయాత్ర’ను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయిదు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఏకధాటిగా ఆమె పర్యటిస్తారని పార్టీ నేతలు చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం గుండెపోటుతో మరణించిన 16 మందికి చెందిన కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర పూర్తయిన తర్వాత ఆమె ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ పర్యటిస్తారని వైకాపా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లోగడ ఓదార్పు యాత్ర పేరిట జగన్ చేబట్టిన యాత్ర ఖమ్మంజిల్లాలో ముగిసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది సాగలేదు. ఈ పరామర్శ యాత్రల సందర్భంగా షర్మిల.. తన విమర్శనాస్త్రాలను ఏపీ సీఎం చంద్రబాబు మీదే ఎక్కుపెడతారని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: