తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నేతలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా, కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న టీటీడీపీ నేతలకు అంతే ఘాటుగా తెలంగాణ ప్రభుత్వం నుండి సమాధానాలు వస్తుండడంతో వాళ్లకు ఏమీ మింగుడు పడడం లేదు. తాజాగా శాసనసభ ఆవరణలో తమకు ప్రత్యేక గది కావాలని, వెంటనే ఇవ్వకుంటే శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఛాంబర్ కు ఆయన పేరున్న బోర్డు తొలగించి మరో బోర్డు పెడతాం అని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉమ్మడి రాజధాని నేపథ్యంలో ఒకే ప్రాంగణంలోని భవనాలను రెండు రాష్ట్రాలు పంచుకున్న పరిస్థితుల మూలంగా ఇబ్బందులు ఉన్నాయని, ఇప్పటికే టీడీపీకి 104, 105 గదులు కేటాయించామని, తెలంగాణలో పార్టీలు ఎక్కువ ఉన్నందున ప్రస్తుతానికి సర్దుకోవాలని, బీఎస్పీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ గదులు లేక ఆదర్శనగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గదులు కేటాయించామని మంత్రి హరీష్ రావు అన్నారు. నా గదికి వారు బోర్డు పెట్టి చూస్తే ఏం జరుగుతుందో అప్పుడు చూపిస్తానని హరీష్ రావు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: