వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటి గురువారం నుంచి ఐదురోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాల పర్యటనకు వెళుతుంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయ సాయి రెడ్డి, ప్రసాద్ రాజులతో కూడిన ఈ కమిటి గురువారం విజయనగరంలో పర్యటించనుంది. 28న శ్రీకాకుళంలో, 29న విశాఖపట్నం, 30న తూర్పు గోదావరి, డిసెంబర్ ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ. ఈ సమావేశానికి ఆ యా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకులు, ముఖ్య నేతలు హాజరవుతారు. మహిళా, యువ, రైతు, తదితర విభాగాల అధ్యక్షులు ఈ పర్యటనకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయటం ప్రధాన లక్ష్యంతో త్రిసభ్య కమిటి పర్యటించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: