ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి దర్యాప్తు లేకుండానే సీఎస్కేను రద్దు చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా శ్రీనివాసన్కు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. సీఎస్కే యజమానులు ఎవరని ప్రశ్నించింది. షేర్ హోల్డర్ల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎన్నికలకు శ్రీనివాసన్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను రద్దు చేసేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరిన విషయం తెలిసిందే. ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొనటంతో లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్‌కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: