తెలుగుదేశం మంత్రులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.దేవినేని ఉమా మహేశ్వరరావు పై ఆయన తీవ్రమైన ఆరోపణ చేశారు.తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావించి కుటుంబ సభ్యులను చంపిన వ్యక్తి అని నాని ఆరోపించారు.తమ నాయకుడు జగన్ ను నోటికి వచ్చినట్లు మంత్రి మాట్లాడారని, అలాగే కొనసాగిస్తే ,ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబును బండ బూతులు తిట్టవలసి వస్తుందని నాని హెచ్చరించారు.మరో నేత , మాజీ మంత్రి కె.పార్దసారధి మాట‌్లాడుతూ దేవినేని ఉమ పిచ్చి వాగుడు వాగుతున్నారని విమర్శించారు. ఎక్కడైనా వారి హామీలు నెరవేర్చినట్లు చర్చకు రాగలరా అని సవాల్ చేశారు.రుణమాఫీ, డ్వాక్రా రుణాల గురించి వారు ఏమి చెప్పారు..ఏమి చేస్తున్నారు..ఎన్ని సార్లు మాటలు మార్చారో చెప్పాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: