ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరో చక్రవర్తిని మరిపిస్తు న్నారని వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. విజయనగరం ఆర్‌కె ఫంక్షన్‌ హాల్లో గురువారం జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా విస్తృతస్థాయి సమా వేశంలో పాల్గొన్న ఆమె చంద్రబాబు పాలన, వ్యవ హారశైలిపై నిప్పులు చెరిగారు. రాజ్యం తగలబడ ిపోయి అంతా అల్లకల్లోలంగా వున్న సందర్భంలో ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి మాదిరిగానే, నారా చక్రవర్తి రాష్ట్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో విదేశాలు తిరగడం బాధాకరమన్నారు. రాజధాని నిర్మాణం పేరిట విదేశీ పర్యటనలు సాగిస్తున్న బాబు వెనుక సంచులు మోసిన వారే తప్ప, సంగతులు వున్న వారు లేకపోవడాన్ని బట్టి ఆ పర్యటనలతో ఎవరికి ఏమి లబ్ధి చేకూరనుందో అవగతమవుతుందని ధ్వజమెత్తారు.  వసూల్‌రాజాగా పేర్గాంచిన చంద్ర బాబు, హుదూద్‌ తుపాను పేరిట అందరి దగ్గర దండడమే తప్ప బాధితులకు ఆయనిచ్చిందే మిటని ప్రశ్నించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుం దో తెలిసీ కూడా చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి ప్రజల్ని వంచించారని, ఇప్పుడేమో కల్లబొల్లి కబుర్లు చెప్పి తన వైఫల్యాలని కప్పిబుచ్చుతున్నారని అన్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజరుకృష్ణ రంగారావు , సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: