ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్, బీహారు మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లు సమీప బందువులు కాబోతున్నారు.మూలాయం మనుమడు తేజ్ ప్రతాప్ యాదవ్ కు లాలూ తన చిన్న కుమార్తె రాజ్ లక్ష్మిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఈ మేరకు పెద్దల మధ్య అవగాహన కుదిరింది.వచ్చే నెలలో నిశ్చితార్దం, ఫిబ్రవరిలో వివాహం జరగవచ్చు.ఇటీవలికాలంలో వీరిద్దరూ రాజకీయంగా సన్నిహితంగా కాగా, తాజాగా బందుత్వం కూడా పెట్టుకుంటున్నారు. తేజ్ప్రతాప్ యూపీలోని మొయిన్పురి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. తమ స్నేహం బంధుత్వంగా మారబోతోందని లాలూ, ములాయం సంతోషంగా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: