వైఎస్-ఆర్-కాంగ్రెస్ అధినేత, సభలో ప్రతిపక్షనేత వైఎస్ -జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి సభలో సభ్యుడైనందుకు తాను సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. హుడ్ హుడ్ తుఫాను పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించాల్సిందిపోయి విమర్శలు చేస్తున్న వారిని ఏమనాలో తెలియడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో హుడ్ హుడ్ తుఫానుపై జరిగిన చర్చలో భాగంగా అచ్చెన్నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై వైసిపి సభ్యులు అభ్యంతర వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: