గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వానికి ఘాటుగా ఓ లేఖ రాశారు. ఇప్పటివరకు అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు, తీసుకున్న చర్యలు, అందుకు అయిన ఖర్చు వంటి వివరాలన్ని పొందుపరుస్తూ ఓ పూర్తి నివేదికని పంపాల్సిందిగా గవర్నర్ ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇకపై కూడా నెలవారీగా అన్ని శాఖలు, విభాగాల పనితీరుకి సంబంధించిన నివేదికని ప్రతీ నెలా 5వ తేదీలోగా తనకి సమర్పించాల్సిందిగా గవర్నర్ ఈ లేఖలో ఆదేశించారు. దాదాపు 23 శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఈ ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: