తమిళనాట నిర్వహించిన రిపబ్లిక్‌ డే వేడుకలు వివాదానికి దారితీశాయి. చెన్నైలో అట్టహాసంగా నిర్వహించిన శకటాల ప్రదర్శనలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తూ వివిధ శాఖలు శకటాలను ఏర్పాటు చేస్తుంటాయి. అందరి దృష్టినీ ఆకర్షించిన వాటికి బహుమతులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే.. ఎన్నడూ లేని విధంగా ఈసారి జయలలిత కటౌట్‌తో శకటాల్ని ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. కొన్నిటిపై కేవలం జయలలితే కాదు.. మాజీ ముఖ్యమంత్రి MGR ఫోటోను కూడా ఉంచారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: