అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియా టూర్ ముగిసింది. మూడ్రోజుల పాటు ఇండియాలో పర్యటించిన ఒబామా దంపతులు తిరిగి బయల్దేరారు. షెడ్యూల్ లో లేకపోయినా..సౌదీరాజు సడన్ గా చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు ఒబామా దంపతులు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్ట్ నుంచి సౌదీ బయల్దేరారు అమెరికా ప్రెసిడెంట్. ఇక షెడ్యూల్ లో ఉన్న తాజ్ మహాల్ ను చూడకుండానే ఒబామా దంపతులు తిరిగి వెళ్లారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒబామాకు వీడ్కోలు చెప్పారు. పీఎం మోడీ కూడా విష్ యూ ఏ సేఫ్ జర్నీ అంటూ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: