తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కులంపై టిడిపి వివాదం సృష్టిస్తోంది. టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ కడియం శ్రీహరి బిసి అని,ఆయన తల్లిదండ్రులు బిసివర్గానికి చెందినవారని ఆరోపించారు. కోటి మంది దళితులు తెలంగాణలో ఉంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వరా అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.రాజయ్యను పదవి నుంచి తొలగించడం దళితులను అవమానించడమేనని అన్నారు.శ్రీహరికి పదవి ఇవ్వడం వెనుక ఏదోమతలబు ఉందని,అది త్వరలోనే బయటకు వస్తుందని ఆయన అన్నారు.కడియం శ్రీహరి బిసి అయితే రిజర్వుడ్ సీటుకు ఆయనను టిడిపి పలుమార్లు ఎందుకు టిక్కెట్ ఇచ్చింది?చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో దళిత కోటాలో ఎందుకు మంత్రి పదవి ఇచ్చారో కూడా మోత్కుపల్లి చెప్పాలి కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: