అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి రథోత్సవంలో శుక్రవారం తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా రథం పక్కనే ఉన్న ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుపై పడటంతో ఆయన ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. వెంటనే ఈ విషయం గ్రహించిన ఆలయ సిబ్బంది ఎమ్మెల్యే మీద పడ్డ ప్రజలను పైకి తీయడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అప్పటికే ఆక్సిజన్ అందక గొల్లపల్లి ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు ఆలయ సిబ్బంది అతిథి గృహంలో సపర్యలు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేతో పాటు ఉన్న ఆర్డీఓ, కొంత మంది ప్రజలు కూడా ఇబ్బందిపడ్డారు. అనంతరం రథోత్సవం యథావిధిగా సాగింది.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: