ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షానికి, పాలక పక్షానికి మద్య వైరం రోజు రోజుకి ముదిరి పోతుంది.. అగ్రిగోల్డ్‌ భూముల అంశంలో వైకాపా నేతలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వైకాపా నేతలపై పరువునష్టం దావా వేస్తానని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఆ మద్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అగ్రిగోల్డ్ కి సంబంధించిన భూములు కొనుగోలు చేశారని ఆయనపై ఆరోపణలు చేశారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోని లక్షలాది మందిని అగ్రిగోల్డ్ ముంచిన విషయం తెలిసిందే.  అగ్రిగోల్డ్ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. అలాంటి అక్రమాస్తులు తన భార్య పేరిట మంత్రి పత్తిపాటి అగ్రిగోల్డ్ ఆస్తులను కొనుగోలు చేశారని, ఈ కారణంగా మంత్రిని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: