ఎప్పుడూ కూల్ గా ఉండే సచిన్ కోపంతో ఊగిపోయాడు. ఎవరిపై… ఎక్కడా అనుకుంటున్నారా..? అయితే అదీ బహిరంగంగా కాదు. ట్విట్టర్ లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సచిన్.  టిక్కెట్లు, లగేజ్ విషయంలో తనకు, తన కుటుంబానికి బ్రిటీష్ ఎయిర్ లైన్స్ అధికారులు కలిగించిన అసౌకర్యానికి ట్విట్టర్ లో సీరియస్ అయ్యాడు. విమానంలో ఖాళీ సీట్లు ఉన్నా.. టిక్కెట్లు ఇవ్వక పోవడం… అలాగే లగేజ్ ఎక్కడ పెట్టారో చెప్పకపోవడం సచిన్ కు కోపాన్ని తెప్పించాయి. ఇదే విషయంపై ట్విట్టర్ లో ఆగ్రహంతో ట్వీట్ చేశాడు సచిన్. ట్విట్టర్ లో పోస్టు చేసిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. దీంతో బ్రిటీష్ ఎయిర్ లైన్స్ అధికారులు సచిన్ కు క్షమాపణలు చెప్పారు. బ్రిటన్ లో ప్రధాని మోడీ టూర్ లో ఉండగానే సచిన్ కు ఇలా జరగడం యాదృచ్చికమే అయినా… ఇండియన్లు మాత్రం సచిన్ ను అవమానించడాన్ని తట్టుకోలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: