మనిషికి ప్రమాదం ఎక్కడ నుంచైనా పొంచి  ఉంటుందని అది మరోసారి రుజువైంది.  భగవంతున్ని భక్తితో దర్శించుకుందామన్న ఆ యాత్రికులపై మృత్యు రూపంలో ఓ హెలికాప్టర్ కూలి దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్గటన  కాట్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి రోజూ జమ్మూ నుంచి కాట్రాకు సమీపంలోని వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీసులు తిరుగుతుంటాయి.

ఈ రోజు యదావిధిగా హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఐదుగురు ప్రయాణికులు వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరగా అది కాట్రాకు సమీపంలో కుప్పకూలింది. దీంతో సిబ్బందితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఘటనతో అక్కడి ప్రజలు చెల్లా చెదురైపోయారు. భయాందోళనతో ఉరుకులు పరుగులు తీశారు. ఇలాంటి ప్రమాదాలు చాలా రోజుల క్రితం జరిగిందని మళ్లీ ఇప్పుడు జరిగిందని అక్కడి వారు అంటున్నారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు మొదలు పెట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: