గత సార్వత్రిక ఎన్నికల్లో.. గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెదక్ లో  సాధించిన మెజారిటీ కంటె. వరంగల్లో కడియం శ్రీహరి సాధించిన మెజారిటీ చాలా ఎక్కువ. అప్పట్లోనే.. వరంగల్లో ఆ పార్టీకి ఉన్న ఆదరణ చూసి అందరూ నివ్వెరపోయారు. కానీ ఇప్పుడు ఆ రికార్డులు అన్నీ బద్ధలైపోయాయి. గులాబీ పార్టీ అద్భుత మైన రికార్డును నమోదు చేస్తోంది. నాలుగున్నర లక్షల పైచిలుకు మెజారిటీ సాధించింది. ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా.. డిపాజిట్లు కోల్పోవడం ఇక్కడ విశేషం. 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో పసునూరి దయాకర్ విజయం సాధించారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: